Tuesday 21 November 2017

ఉత్తర తెలంగాణ లో పెట్రోలియం ఉత్పత్తులు నిలవ చేయుటకు తీసుకున్న చర్యలు

2014 జూన్ రెండవ పక్షంలో ఉత్తర తెలంగాణలో చమురు ఉత్పత్తుల కొరత ఏర్పడింది. దీనికి కారణం కొండపల్లి, విజయవాడ నుంచి డీజిల్, పెట్రోల్ సరఫరా ఆగి పోవటం. అందువల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలన్నిటికీ రామగుండం నుంచి సరఫరా చేయవలసి వచ్చింది. దీంతో రామగుండం డిపో పంపాల్సిన దుకాణాలు 200 నుంచి 340కి  పెరిగాయి.

పౌర సరఫరాల శాఖ కమీషనర్ ఈ విషయాన్ని చమురు సంస్థలతో చర్చించారు. తెలంగాణా రాష్ట్రంలో చమురు ఉత్పత్తుల కొరత లేకుండా చేయమని సూచించారు. చమురు సంగ్రాహకులు  ఎంత నిల్వలు ఉన్నాయి, చమురు సంస్థలు, డిపోలు, చిల్లర (రిటైల్ )దుకాణాలలో సమస్యలను సమీక్షించి, పౌర సరఫరాల కమీషనర్ కు వెంటనే నివేదిక ఇవ్వమన్నారు. ప్రధాన కార్యదర్శి కూడా ఈ విషయంలో కలగ జేసుకున్నారు. రామగుండం డిపో ఈ పెను భారాన్ని తట్టుకోలేదని, ఇతర డిపోల నుంచి చమురు ఉత్పత్తులను తెచ్చి డిమాండ్ - సప్లై మధ్య అంతరాన్ని తగ్గించమని చమురు సంస్థలకు సూచించారు. వరంగల్- రామగుండము- చెర్లపల్లి మధ్య సరఫరా వాహనాలకు  (రేకులు) విరివిగా తిరిగేందుకు అనుమతి ఇవ్వమని దక్షిణ మధ్య రైల్వే జి. ఎం. ను  కోరారు. అదే విధంగా ఈ వాహనాలకు ప్రయాణ సమయం తగ్గించేందుకు వీలుగా దక్షిణ, నైరుతి రైల్వే అధికారులతో సమన్వయము చేసుకోమని, ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలుగ కుండా ఉండేందుకు గాను ఒకే గమ్యానికి చేరే వాహనాలను రెండు కంటే ఎక్కువ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.  

ఇంకా, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మరియు చమురు సంస్థల మధ్య లావాదేవీలకు సమయాన్ని వీలైనంత తగ్గించాల్సిందిగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ను కోరారు. తెలంగాణా రాష్ట్రానికి త్వరిత గతిన చమురును అందించటానికి విశాఖపట్నం పోర్ట్లో రవాణాకు సిద్ధంగా ఉన్న ఆయిల్ టాంకర్ లను రామగుండము చెర్లపల్లి వంటి ప్రదేశాలకు వెంటనే పంపమని కోరారు.   

గౌ. వినియోగదారుల వ్యవహారాల, ఆహార మరియు పౌర సరఫరాల మంత్రిగారు చమురు సంస్థల ప్రతినిధులతో సమావేశమై వారికీ చర్యలను తీసుకోమని సూచించారు :
…. చమురు సంస్థలు  రామగుండం ఐ. ఓ. సి. డిపో వద్ద ట్రక్కుల్లో చమురు ఉత్పత్తులను లోడింగ్ చేసేందుకు రెండు షిఫ్టులలో పని చేయాలి.  
…. చమురు సంస్థలు వరంగల్, సూర్యాపేట, రామగుండము(హెచ్. పీ. ఎస్.) ల మధ్య సర్దుబాటు చేసుకొని పూర్తి డిమాండును సత్వరమే ఎదుర్కోవాలి.  దూరంగా ఉన్న జిల్లాలకు రవాణా సమయం తగ్గించటానికి ఇది అవసరం.

…. డిపో రెండు షిఫ్టులలో పని చేయాలి, దీని వల్ల సరుకు అందుకోవటం, సరఫరాలో లోపాలు నివారించబడతాయి.
తెలంగాణా రాష్ట్రంలో దీర్ఘ కాలిక ప్రణాళిక చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వ్యాఖ్యానించారు.  చమురు సంస్థలు కూడా ఎక్కువ సంఖ్యలో ఆయిల్ డిపోలను ఏర్పాటు చేయాలని, అవసర మనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వారికి తగు విధంగా సహాయం చేస్తుందని  తెలియజేశారు.

లభ్యత సరఫరాల పరిస్థితి చమురు సంస్థలతో క్రమంగా తెలుసుకుంటూ ఉన్నారు.  

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఉత్తమ కృషి వలన చమురు ఉత్పత్తుల (డీజిల్, పెట్రోల్) సరఫరా రామగుండం డిపోలో మెరుగు పడింది. తెలంగాణా రాష్ట్రంలో వీటి కొరత అదుపు లోకి వచ్చింది .


మోహిత

7 సెప్టెంబర్ 2014

No comments:

Post a Comment