మకర సంక్రాంతి పండుగ సమయంలో మరుష దేశంలోని తెలుగువారు కోళ్ల పందేలని నిషేధించారు!
అదే సమయంలో, ఆంధ్ర పుణ్య భూమిలో కోళ్ల పందేలు జరుగుతున్నాయి ! ! !
ఈ మాట చెప్పటానికి నేను చాలా కలత చెందుతున్నాను.
మానవులం అయ్యుండి రక్తపాతంతో ఎలా ఆనందించగలం ?
రక్తపు మడుగులో గిలగిలా తన్నుకొని మరణిస్తున్న కోడిపుంజును చూసి ఎలా ఆనందం పొందగలం?
మానవునిలో హింసాప్రవృత్తిని సంతృప్తిపరిచేందుకు మార్గాలను కనుగొని కోళ్ల పందేలు మంచివే అంటాం !!!!!!!
ఇది అమానుషం కాదా !!!!!!!!
అనంగీకారం కాదా !!!!!
ఇలాంటి ఆలోచనతో ఎంత నీచ స్థాయికి చేరుకున్నామో ఊహించండి !!!!
స్వామి చిన్మయానంద చెప్పినట్టు - మకర సంక్రాతి పర్వదినం అంటే భూమిపై సకల జీవరాశిని పోషించే సూర్యభగవానుడికి, మన తల్లి ప్రకృతికి మనం కృతజ్ఞత చూపాల్సిన సమయం!
కాని ప్రవర్తనలో ఎంత వైరుధ్యం!!
కనుమ రోజున వ్యవసాయంలో మనకు అడుగడుగునా దన్నుగా ఉండే పశువులను పూజిస్తాం. మరో వైపు, కోళ్ల పందేలని చూస్తూ హింసాకాండను ఆస్వాదిస్తూ వినోదిస్తాం.
నేను మీ భావాలను బాధించి ఉండవచ్చు, కాని అది ఒక లోతైన ఆలోచన కోసం అని గ్రహించండి.
సాయిరాం.
--సంజీవ నరసింహ అప్పడు, మారిషస్, మకర సంక్రాతి, దుర్ముఖి నామ సంవత్సరం
15 జనవరి 2017
No comments:
Post a Comment